నా తల్లిని అవమానించిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది వైసీపీ కాదా: మంత్రి లోకేష్

1 year ago 21
తన తల్లిని అవమానించారని చంద్రబాబు శాసనసభను బహిష్కరించారన్నారు మంత్రి నారా లోకేష్. తమ పార్టీ ఎమ్మెల్యేలు యథావిధిగా సభా కార్యక్రమాలకు హాజరయ్యారని.. జగన్‌ మినహా.. మిగిలిన పదిమంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావడం లేదని ప్రశ్నించారు. మహిళలను అవమానించే వారిని వైఎస్సార్‌సీపీ ప్రోత్సహిస్తుందా అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను ఆయన ప్రశ్నించారు. జగన్‌ కుటుంబసభ్యులపై తాను కానీ.. తమ పార్టీ నేతలు గానీ ఎప్పుడూ తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో శాసనసభలో జరిగిన నాటి సంఘటనను గుర్తుచేసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు సభ నుంచి పారిపోయారంటూ మండలిలో ప్రతిపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తల్లి, చెల్లి, కుటుంబసభ్యులను ఎవరు అవమానించినా సమర్థించేది లేదని బొత్స అంటున్నారుని.. ఆ రోజు సభలో తన తల్లిని అవమానించేలా మాట్లాడినవారికి టికెట్లు ఇచ్చారన్నారు. అది సమర్థించడం కాదా అన్నారు.
Read Entire Article