Narendra Modi Praises Chandrababu Naidu: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించి, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అమరావతి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు దార్శనికతను ప్రశంసించారు. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవానికి హాజరవుతానని మోదీ తెలిపారు. చంద్రబాబు నాయుడు నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ముఖ్యంగా ఐటీ అభివృద్ధిలో ఆయన చేసిన కృషిని కొనియాడారు.