ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. తెలంగాణ రాజకీయాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన సభకు అనుమతి ఇచ్చి ఉంటే సాదాసీదాగా జరిగిపోయేదని అన్నారు. అమరావతిలోని అమరజీవి విగ్రహాన్ని సందర్శించిన అనంతరం విలేకర్లతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తెలంగాణ ఆ ప్రాంత భూమిపుత్రులదేనని స్పష్టం చేశారు. జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులు అక్కడ పోటీచేస్తామంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్ని్ంచారు. ప్రాంతీయ విద్వేషాలకు ముగింపు పలకాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.