అక్రమాస్తుల కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నవంబరు 20 హాజరయ్యారు. అదే సమయంలో, బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు హాజరైన ఆయన కుమార్తె సునీత.. జగన్కు తారసపడ్డారు. కానీ, జగన్ పలకరించకుండా వెళ్లిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ ఒకరినొకరు చూసుకున్నా మాట్లాడకపోవడం గమనార్హం. అయితే, వివేకా హత్య కేసులో జగన్పై సునీత ఆరోపణలు చేసి, కోర్టుకు వెళ్లారు.