తెలంగాణ ప్రభుత్వం అద్దె భారాన్ని తగ్గించుకోవడానికి ప్రైవేట్ భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి తరలిస్తోంది. ఇందులో భాగంగా నార్సింగ్లో ఉన్న గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గచ్చిబౌలిలోని టీ హబ్కు మార్చాలని నిర్ణయించింది. అయితే.. ఈ నిర్ణయంతో భవన యజమాని విజయ్ రాజ్ అధికారులకు ఒక వినూత్న లేఖ రాశారు. కార్యాలయం తరలిపోతే గ్రామం కళ తప్పిపోతుందని.. అందుకే తనకు అద్దె చెల్లించకపోయినా పర్వాలేదు కానీ ఆఫీసును మాత్రం అక్కడే కొనసాగించాలని ఆయన వేడుకున్నారు.