నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేట ఓ యువతిపైపై గ్యాంగ్ రేప్ జరిగింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆమె బంధువుతో కలిసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాలకృత్యాల కోసం గుట్ట ప్రాంతానికి వెళ్లగా.. గ్రామానికి చెందిన 8 మంది యువకులు బంధువుపై దాడి చేసి ఆ తర్వాత యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనకు పాల్పడ్డ వారిని గుర్తించిన పోలీసులు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.