Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ జలాశయం 18 ఏళ్ల తర్వాత జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండటంతో అధికారులు ఆరు క్రస్ట్ గేట్లను తెరిచి 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాగర్ నీటి విడుదలతో రైతుల సాగు పనులకు ఊతం ఇవ్వనుంది.