ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ విచారించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. సిట్ విచారణలో ఏంజరిగిందో కేసీఆర్ చెప్తారని అనుకుంటున్నని తెలిపారు. రెండేళ్లవుతున్నా.. ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపునకు రావట్లేదన్నారు. తన ఫోన్, భర్త ఫోన్లు ట్యాప్ చేశారని అనుమానాలున్నాయని ఆరోపించారు.