టీడీపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నాదెండ్ల భాస్కరరావు.. ఆ పార్టీలో తీవ్ర సంక్షోభానికి కారణమయ్యారు. 1984లో ఆయన ఎన్టీఆర్పై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. 1995లో చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలు, సీఎం పదవిని దక్కించుకున్నారు. ఈ ఘటనపై నాదెండ్ల భాస్కరరావు తనదైన శైలిలో స్పందించారు. తాను ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవలేదని.. నమ్ముకున్న అల్లుడే ఆ పని చేశాడన్నారు.