నాదీ రాయలసీమే.. వైఎస్ జగన్ వార్నింగ్‌పై తిరుపతి ఎస్పీ రియాక్షన్

1 year ago 17
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఇటీవల ఆరోపించిన వైఎస్ జగన్.. ఇందుకు కొంతమంది పోలీసులు కూడా సహకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసే చట్టవ్యతిరేక పనులకు మద్దతు తెలిపే అధికారులు ఎక్కడున్నా వెనక్కి రప్పించి చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. చట్టానికి లోబడి పనిచేస్తున్నామన్న తిరుపతి ఎస్పీ.. రాజకీయ విమర్శలను పట్టించుకోమని చెప్పారు.
Read Entire Article