తెలుగు రాష్ట్రాలలో గత వారం రూ. 350 మార్కును తాకిన చికెన్ ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. హైదరాబాద్, రాజమండ్రిలలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 250 కి చేరగా.. గుంటూరులో రూ. 260, ఖమ్మంలో రూ. 280 గా ఉంది. ధరలు తగ్గడంతో చికెన్ దుకాణాల వద్ద వినియోగదారుల రద్దీ పెరిగింది. మరోవైపు మటన్ ధరలు మాత్రం హైదరాబాద్లో రూ. 800 నుంచి రూ. 950 వరకు ఇతర జిల్లాల్లో రూ. 700 నుండి రూ. 800 వరకు స్థిరంగా ఉన్నాయి.