ఆ చిన్నారిని రెండేళ్ల వయసు నుంచి మృత్యువు వెంటాడింది. రెండేళ్ల వయసులో తన కన్నతండ్రే ఆమెను చంపేయాలని దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఆ చిన్నారి బయటపడింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఆమె గుండెలో రెండు రంధ్రాలున్నట్టు తేలింది. ఈసారి తన పెదనాన్న తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో ఆ చిన్నారి మరోసారి మృత్యువును జయించింది. నిమ్స్ వైద్య బృందం.. ఆ చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ చేసి.. ఆమె ప్రాణాలను నిలబెట్టారు.