ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద తెలంగాణలోని వరంగల్కు 100, నిజామాబాద్కు 51 చొప్పున మొత్తం 151 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం కేటాయించింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి టోకన్ సాహు రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. అయితే, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర మంత్రి టోకన్ సాహు వెల్లడించారు. విద్యుత్ సౌకర్యాలు, ఇతర నిర్మాణాలు పూర్తయిన తర్వాతే ఈ బస్సులు క్షేత్రస్థాయికి చేరుతాయని ఆయన స్పష్టం చేశారు.