ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపైనే ఇప్పటివరకు ఆరు తప్పుడు కేసులు నమోదు చేశారని వెల్లడించారు. అదే సమయంలో పాస్టర్ అభినయ్ దర్శన్ విషయంలోనూ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇక ఆలయ నిర్మాణం కచ్చితంగా పూర్తి చేస్తామని రఘురామ ధీమా వ్యక్తం చేశారు.