వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పునిచ్చింది. కామినేని హాస్పిటల్ వైద్యుల తప్పిదం కారణంగా మరణించిన స్వాతి అనే బాలింత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందులో 90 లక్షలు బిడ్డ పేరున, 10 లక్షలు తండ్రికి చెల్లించాలని, అదనంగా లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. నెల రోజుల్లో చెల్లించకపోతే వడ్డీతో సహా చెల్లించాలని ఫోరం స్పష్టం చేసింది.