రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడలో విషాదం చోటుచేసుకుంది. పల్లిగింజ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇంట్లో వేయించిన పల్లీలు తింటుండగా.. అనుకోకుండా గొంతులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయింది. ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.