నిజామాబాద్ జిల్లా దేవక్కపేటలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మోహన్ అనే వ్యక్తిని అతని ఇద్దరు భార్యలు కవిత, సంగీతలు అతి కిరాతకంగా హత్య చేశారు. భర్త వేధింపులు తట్టుకోలేక తరచూ గొడవలు జరుగుతుండగా.. ఈ గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో ఆగ్రహించిన ఇద్దరు భార్యలు ఏకమై మోహన్ ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలైన మోహన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. కుటుంబ కలహాలు, వేధింపుల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.