నిజామాబాద్​ మేయర్‌ భర్తపై దాడి.. తలపై సుత్తితో కొట్టిన ఆటో డ్రైవర్

1 year ago 32
నిజామాబాద్‌ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ మేయర్‌ దండు నీతూ కిరణ్‌ భర్తపై రసూల్‌ అనే ఆటో డ్రైవర్ విచక్షణా రహితంగా దాడి చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే.. అతని తలపై సుత్తితో దాడి చేశాడు. మేయర్‌ భర్త చంద్ర శేఖర్ తన భూమిని కబ్జా చేశాడని ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చంద్ర శేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన అనంతరం నిందితుడు పరారీ కాగా.. నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read Entire Article