నిజామాబాద్ పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పసుపు బోర్డును ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్షా మాట్లాడుతూ.. పసుపు రైతుల 40 ఏళ్ల కలను ప్రధాని మోదీ నెరవేర్చారన్నారు. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2030 నాటికి ఒక బిలియన్ డాలర్ల విలువైన పసుపును ఎగుమతి చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ పసుపుకు రాజధాని లాంటిదని అమిత్ షా అన్నారు.