నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో దారుణ హత్య కలకలం రేపింది. బాసర రహదారి పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. తల, వేళ్లు నరికివేయబడి, వివస్త్రగా ఉన్న మృతదేహాన్ని చూసి అత్యాచారం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నేరస్థులు మహిళ గుర్తింపును చెరిపేసేందుకు ప్రయత్నించారని, వ్యక్తిగత కక్షలే కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.