సూర్యాపేట జిల్లాలో ఓ కానిస్టేబుల్ కృష్ణంరాజు నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తడం సంచలనంగా మారింది. మైనర్ బాలికను పెళ్లి చేసుకుని వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకున్న అతను.. ఇసుక దందాలో సస్పెండ్ అయ్యాడని సమాచారం. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.