తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బుధవారం ఖమ్మం జిల్లాలో గరిష్టంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని.. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరిగే సూచనలు ఉన్నందున మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.