తెలంగాణలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతోంది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో శుక్రవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 20 మండలాల్లో వడగాలులు వీస్తుండగా.. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 31 జిల్లాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు వెళ్లొద్దని సూచించింది.