Nimmakuru Gurukul Old Students Donates Rs 3 Crores: బతుకు నేర్పిన బడి కోసం పూర్వ విద్యార్థులు చేయి, చేయి కలిపారు. ఆ స్కూల్ పరిస్థితిని చూసి చలించిపోయారు.. వెంటనే స్పందించి భారీ విరాళాన్ని అందించారు. కృష్ణా జిల్లా నిమ్మకూరు ప్రభుత్వ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు తమ పాఠశాల అభివృద్ధికి రూ.3 కోట్లు విరాళంగా సేకరించారు. 1987లో ఎన్టీఆర్ స్థాపించిన ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలను బాగు చేయడానికి పూర్వ విద్యార్థులు నడుం బిగించారు.