డీలిమిటేషన్ బిల్లుపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ బిల్లును రెండు, మూడు రోజులలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బిల్లుపై తమ వైఖరి స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లుపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సజ్జల స్పష్టం చేశారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మరింత మందికి అవకాశాలు లభిస్తాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా అభిప్రాయపడుతున్నారు.