హనుమకొండలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తన అభిమాని నిరంజన్ను కలిసి అతడి కోరికను తీర్చారు. ఈ క్రమంలోనే అతడి కుటుంబానికి అండగా నిలిచారు. వారు క్యాంటీన్ పెట్టుకునేందుకు సాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇక అతడికి ఉన్న సమస్య కంటే.. అతడి ధైర్యం చాలా గొప్పదని పేర్కొన్నారు. అరుదైన వ్యాధితో పోరాడుతున్న నిరంజన్.. పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.