హైదరాబాద్ను ఆకలి లేని నగరంగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లను తెరిచింది. కేవలం 5 రూపాయలకే అల్పాహారం, భోజనం అందిస్తోంది. తొలి రోజు బాగానే ఉన్నా, ప్రారంభించిన రెండు రోజులకే పేదలకు నిరాశ ఎదురైంది. టిఫిన్ల కోసం వచ్చిన వారికి అవి అయిపోవడంతో ఖాళీ కడుపుతో వెనుదిరుగుతున్నారు. ఆకలి తీరుతుందని ఆశగా వెళ్లిన వారికి నిరాశే మిగులుతోంది. మంచి ఉద్దేశంతో మొదలైన ఈ పథకం అమలులో లోపాలు కనిపిస్తున్నాయి.