భూమి రిజిస్ట్రేషన్ అనేది ప్రతీ ఒక్కరికి అవసరం. ఒకవేళ అలా చేయకుంటే.. ఆ భూమి నాదే అని నిరూపించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకప్పుడు ఇతరుల భూములు కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు కేవలం కాగితాల మీదనే సంతకాలు చేసుకునే వారు. తర్వాత ఆ భూమిని సాగు చేసుకుంటూ వచ్చేవారు. రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రం ఉండేవి కావు. అలాంటి వారి కోసం గత ప్రభుత్వం సాదా బైనామాలను తీసుకొచ్చింది. ఇలా కాగితాల ద్వారా ఒప్పందం చేసుకున్న వారి భూములను కూడా రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు.