ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ సంస్థలలో ఉద్యోగాల భర్తీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏపీ ట్రాన్స్కో, జెన్కోతో పాటు మూడు డిస్కంలలో ఖాళీగా ఉన్న 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (AEE) రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి నోటిఫికేషన్ జారీకి అనుమతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ నియామకాలు జరగనున్నాయి. ఈ నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ బహుజన విద్యుత్ ఉద్యోగుల యూనియన్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది.