ఆంధ్రప్రదేశ్లో మొగల్తూరు సబ్రిజిస్ట్రార్కు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. ఏసీబీ అధికారులమంటూ బెదిరించి డబ్బులు దండుకోవాలని చూశారు. దీంతో భయపడిపోయిన సబ్రిజిస్ట్రార్.. సైబర్ నేరగాళ్లకు రూ. 2 లక్షలు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మరో రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన సబ్రిజిస్ట్రార్ ఏసీపీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు.