ఉన్నదంతా రాసిచ్చేసి.. తమ కొడుకుల చేతిలో మోసపోయిన చిగురుటాకుల ధీనగాథ ఇది. వాళ్ల గోరుముద్దలు తిని పెద్దయిన తర్వాత చివరి రోజుల్లో కనీసం తిండి కూడా పెట్టకుండా ఆ తల్లిదండ్రులను అనాథల్లా రోడ్డున పడేసిన హృదయవిదారక ఘటన. ఎవరు చెప్పిన వినని ఆ కొడుకుల గురించి కలెక్టర్కు చెప్పుకోవాలని వచ్చారు. ప్రజావాణి రద్దు కావడంతో కలెక్టరేట్ ఆవరణలో దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నబిడ్డలే రాక్షసులుగా మారితే ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం.