Woman Ends Life In Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో వివాహేతర సంబంధం విషాదాంతమైంది. ప్రియుడు పట్టించుకోవడం లేదని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో, రొంపిచెర్లలో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కన్నతల్లిని కొడుకే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.