రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులకు సంబంధించి నీతి ఆయోగ్ కీలక నివేదికను వెలువరించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అర్వింద్ పనగాఢియాతో కలిసి నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓలు శుక్రవారం ఈ నివేదికను విడుదల చేశారు. ఇప్పటికైనా మూలధన వ్యయ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, ఖర్చులు సమర్థంగా నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. కట్టుదిట్టమైన ఆర్థిక క్రమశిక్షణతో వనరులను పెంచుకోవాలని నీతి ఆయోగ్ హెచ్చరించింది. ఈ జాబితాలో దక్షిణాది రాష్ట్రాల దిగువకు పడిపోయాయి.