నీళ్లు నమిలామట, చెమటలు పట్టాయట.. అచ్చెన్నాయుడు సెటైర్లు

1 year ago 17
Andhra Pradesh Legislative Council: శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు వివరంగా సమాధానం చెబుతుంటే ఓ టీవీ ఛానెల్‌లో అందుకు విరుద్ధంగా ప్రసారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ‘మంత్రులు నీళ్లు నమిలారు. చెమటలు పట్టాయి’ అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలను తెలిపేందుకు శాసనసభ ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. వర్షాలు లేక ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం అందిజేస్తుందని ప్రకటించారు. అక్టోబర్‌ 29న 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించిందని తెలిపారు. పంట నష్టపోయిన 1.44 లక్షల మంది రైతులకు పరిహారం అందించేందుకు రూ.159.20 కోట్ల నిధులు మంజూరు చేశామని, త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. కరవు పీడిత మండలాల అంశంపై శుక్రవారం (నవంబర్ 15) శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు.
Read Entire Article