ఏపీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరానికి చెందిన ఓ బాలిక అమ్మమ్మ వద్ద ఉంటోంది. ఆ బాలికకు ఉపాధి చూపిస్తానని నమ్మించి.. ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ నెలలో ఈ దారుణం జరగ్గా.. శనివారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వెలుగులోకి వచ్చింది. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. నూకరాజు అనే యువకుడితో పాటు.. అతనికి సహకరించిన హేమలత అనే మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.