Three Nuzvid IIIT Lecturers Suspended: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన ముగ్గురు అధ్యాపకుల సస్పెండ్ చేశారు. ముగ్గురు లెక్చరర్లు పీయూసీ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులకు అసభ్యకర మెసేజ్లు పంపి వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థినిలు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ జరిపి ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గోపాలరాజు తెలిపారు. ప్రాథమిక చర్యల కింద ముగ్గురు అధ్యాపకులను సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.