Puttaparthi Rajkot Express Train Peacock Died: శ్రీ సత్యసాయి జిల్లాలో రాజ్కోట్ ఎక్స్ప్రెస్ రైలుకు ఊహించని అడ్డంకి ఎదురైంది. పెనుకొండ దగ్గర రైలు ఇంజిన్పైకి నెమలి వచ్చి పడటంతో ఒక్కసారిగా రైలు నిలిచిపోయింది. హై వోల్టేజ్ విద్యుత్ లైన్ కావడంతో నెమలి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూశారు. దాదాపు అరగంట పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు.