కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతికి వైసీపీ అడ్డుపడుతోందన్న రేణుకా చౌదరి వ్యాఖ్యలపై స్పందించిన పేర్ని నాని.. అమరావతిని ఎవరో ఆపాల్సిన పని లేదని. నెల రోజుల తర్వాత నాలుగు చినుకులు పడితే అదే ఆగిపోతుందని పేర్ని నాని అన్నారు. ‘తల్లీ.. అమ్మా.. నెల రోజులు ఆగండి.. నాలుగు చినుకులు పడితే అదే ఆగిపోతుంది’ అని పేర్ని నాని అన్నారు. మరోవైపు జగన్ మావిగన్ ప్రతిపాదనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని.