ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రిజ్వీకి ఏఐజీ ఆసుపత్రిలో నెలకు రూ. 10 లక్షల జీతంతో ఉద్యోగం వచ్చిందని ఆరోపించారు. హై-సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లను ఉద్దేశపూర్వకంగా ఆపారంటూ రిజ్వీపై మంత్రి ఫిర్యాదు కూడా చేశారు. అయితే.. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలను ప్రశ్నించినందుకే అధికారులను వేధిస్తోందని తిరిగి విమర్శించింది.