నెల్లూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదనే కారణంతో యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. యువకుడికి తూర్పుగోదావరి జిల్లాగా, యువతి ఏలూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. లాడ్జిలో రూమ్ తీసుకున్న ఈ జంట.. బలవన్మరణానికి పాల్పడింది. గదిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి చూడగా.. యువతీ యువకుల మృతదేహాలు కనిపించాయి.