నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం గోవింద నామాలను అపహాస్యం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని స్పష్టం చేశారు. ఇలాంటివి ఆపాలని సూచించారు. మరోవైపు ఈ అంశంపై చట్టపరంగా ముందుకెళ్లాలని జనసేన నేతలకు సూచించారు. మరోవైపు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గోవింద నామాలను ఇలా పేరడీ చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.