తమను రెగ్యులరైజ్ చేయాలంటూ సమ్మె బాట పట్టిన విద్యుత్ ఆర్టిజన్లపై ఉక్కుపాదం మోపిందేందుకు ట్రాన్స్కో సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటల్లోగా విధుల్లో చేరని పక్షంలో ఉద్యోగాల నుండి తొలగిస్తామని ట్రాన్స్కో బుధవారం రాత్రి తుది హెచ్చరిక జారీ చేసింది. 'టెస్మా' చట్టం అమలులో ఉన్నందున ఈ సమ్మె చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. విద్యుత్ వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలిగిస్తే సహించేది లేదని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.