ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి.. ఏపీ వ్యాప్తంగా మార్చిలోనే ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. పలు జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.. శనివారం కూడా అనేక జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు తీవ్రస్తాయిలో నమోదువుతోన్న విషయం తెలిసిందే.