గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసినా.. తిరిగి ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రాజీనామా చేసిన ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలోని సమస్యలు, ముఖ్యంగా కొత్తగా చేరిన వారి రాజీనామాలపై హైకమాండ్తో చర్చించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. హిందుత్వ, మోదీ పట్ల తన విధేయత చెక్కుచెదరలేదని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని స్పష్టం చేశారు.