తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తరుచూ బయటపడుతున్న అంతర్గత వివాదాలపై తెలంగాణ కొత్త ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో మెదక్ లోక్సభ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించగా.. నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే మరో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా.. మీనాక్షితోనే పర్సనల్గా మాట్లాడతానంటూ స్పెషల్గా రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.