Raghu Rama Krishna Raju On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు తనను అపార్థం చేసుకున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. భీమవరం డీఎస్పీపై తనకు ఫిర్యాదులు రాలేదని, తన పరిధిలోని అధికారి పనితీరును సమర్థించానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడానికి భయం కారణం కాదని, విశాఖ డేటా సెంటర్ వల్ల లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల పీపీపీ మోడ్ అమ్మకం కాదని, 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికే చెందుతాయని వివరించారు.