ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే కవితపై జనసైనికులు విరుచుకుపడుతుండగా.. తాజాగా నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా విమర్శలు గుప్పించారు. తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే అని పేర్కొన్న అర్వింద్.. ఆయన తన సినీ కెరీర్ను త్యాగం చేసి ప్రజా జీవితంలోకి వచ్చారని తెలిపారు. అలాంటి నాయకునిపై చేసిన వ్యాఖ్యలు కవిత అహంకారానికి నిదర్శనమని ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు.