ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన చిట్ చాట్లో నేనే రాజు, నేనే మంత్రి అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. నేనే సీఎం, నేనే మున్సిపల్ మంత్రిని అని చెప్పానని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములకు తనదే బాధ్యత అని చెప్పినట్లు స్పష్టం చేశారు.