ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీలో పలువురు ప్రజాప్రతినిధులు ఇంధన పొదుపు చర్యలు పాటిస్తున్నారు. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం కాన్వాయ్ పరిమాణం తగ్గించుకున్న సంగతి తెలిసిందే. పలువురు మంత్రులు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు.. సైకిల్ తొక్కుకుంటూ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. సుమారు పది కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చి.. సీఎం క్యాంప్ కార్యాలయం చేరుకున్నారు.