టీడీఎల్పీ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు పలు అంశాలపై సూచనలు, హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, ఏది పడితే అది మాట్లాడవద్దని సూచించినట్లు సమాచారం. అలాగే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే పనితీరు మార్చుకోవాలని హెచ్చిరించినట్లు సమాచారం. పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు తెలిసింది.